IND VS SL : శ్రీలంకతో సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్

by Harish |
IND VS SL : శ్రీలంకతో సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్
X

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు గాయపడ్డాడు. టీ20 సిరీస్ కోసం భారత ఆటగాళ్లు పల్లెకెలె స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్‌ సెషన్‌లో సిరాజ్ కుడి కాలికి గాయమైంది. బంతి బలంగా అతని కాలికి తగిలినట్టు తెలుస్తోంది. వెంటనే అతను చికిత్స తీసుకున్నాడు. అయితే, గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 27న జరిగే తొలి టీ20కి అతను దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ అదే జరిగితే భారత్ జట్టుకు లోటే అని చెప్పాలి. షమీ, బుమ్రా గైర్హాజరులో ఈ సిరీస్‌లో సిరాజ్ బౌలింగ్ దళాన్ని నడిపించనున్నాడు. తొలి మ్యాచ్‌కు అతను దూరమైతే ముకేశ్ కుమార్ లేదా అవేశ్ ఖాన్ తుది జట్టులో చోటు దక్కించుకోవచ్చు. హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ ముగ్గురు పేసర్లను ఆడించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.



Next Story