Rahul, Shreyas: భారత జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్

by Mahesh |
Rahul, Shreyas: భారత జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ ఈ నెల చివరి వారంలో టీ20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ ఆడేందుకు శ్రీలంకకు వెళ్లనుంది. ఈ క్రమంలో బీసీసీఐ టీ20, వన్డే జట్లను ప్రకటించింది. టీ 20 లకు ఎవరూ ఊహించని విధంగా సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. అలాగే వన్డే జట్టులో కోహ్లిని కొనసాగిస్తూ.. రోహిత్ శర్మకు కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. రెండు ఫార్మాట్లకు యువ ప్లేయర్ శుభ్ మాన్ గిల్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత.. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లకు వన్డే జట్టులో స్థానం దక్కింది. అయితే గతంలో శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా లోకల్ ఫార్మట్ మ్యాచులు ఆడలేదు. దీంతో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌ల సంవత్సర కాంట్రాక్ట్ ను రద్దు చేశారు. ఇదిలా ఉంటే.. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా కేఎల్ రాహుల్ గతంలో కెప్టెన్సీ నుండి వైదొలిగిన అనంతరం మళ్లీ జట్టులో చోటు దక్కింది.



Next Story