అలా చేసే ప్లేయర్లకు షాక్ ఇచ్చిన ఐపీఎల్.. ఇక నుంచి వారిపై రెండేళ్ల నిషేధం

by Mahesh |
అలా చేసే ప్లేయర్లకు షాక్ ఇచ్చిన ఐపీఎల్.. ఇక నుంచి వారిపై రెండేళ్ల నిషేధం
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్(IPL) 2025-27 మెగా వేలంపై బీసీసీఐ కీలక నిర్ణయాలను తీసుకుంది. త్వరలో జరిగే వేలం కోసం.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్(IPL Governing Council) సమావేశం బెంగళూరులో జరిగింది. ఈ సమావేశంలో ఐపీఎల్ 2025-27 సర్కిల్‌కు సంబంధించి నిబంధనలు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఫ్రాంఛైజీల పర్సు వాల్యూ పెంపు, అన్ క్యాప్డ్ ప్లేయర్ రూల్, ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు చెల్లించాలని నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ఈ సారి ఐపీఎల్ వైలంలోనే కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. మెగా వేలంలో పాల్గోనాలనుకునే ఆటగాళ్లు కచ్చితంగా ముందుగా రిజిస్టర్ చేసుకొవాలి. లేందంటే వారు వచ్చే సంవత్సరం వేలం లోకి ఎంట్రీ పొందలేరు. అలాగే వేలం లోకి వచ్చి.. అమ్ముడు పోయిన ప్లేయర్ కచ్చితంగా సీజన్ కు ముందే అందుబాటులో ఉండాలి.. లేదంటే వారిపై రెండు సీజన్ల నిషేధం విధించనున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed