వార్మప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై శ్రీలంక గెలుపు

by Harish |
వార్మప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై శ్రీలంక గెలుపు
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌కు ముందు శ్రీలంకకు ఊరట విజయం దక్కింది. తొలి వార్మప్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన ఆ జట్టు తిరిగి పుంజుకుంది. శుక్రవారం జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 41 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్(32 నాటౌట్) టాప్ స్కోరర్. నిశాంక(22), షనక(23) విలువైన పరుగులు జోడించారు. అనంతరం లంక బౌలర్లు మోస్తరు లక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ను 18.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌట్ చేశారు. కర్టిస్ కాంఫర్(26) టాప్ స్కోరర్. డాసున్ శనక(4/23) నాలుగు వికెట్లతో చెలరేగి ఐర్లాండ్ ఓటమికి కారణమయ్యాడు. తీక్షణ, హసరంగ రెండేసి వికెట్లతో రాణించారు. టీ20 ప్రపంచకప్‌లో ఈ నెల 3న శ్రీలంక తన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది.

Advertisement

Next Story

Most Viewed