- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BREAKING: టీ 20 వరల్డ్ కప్కు భారత జట్టు ప్రకటన.. ఇద్దరు స్టార్ ప్లేయర్లకు బిగ్ షాక్
దిశ, వెబ్డెస్క్: జూన్లో జరగనున్న టీ-20 వరల్డ్ కప్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్ల అనౌన్స్మెంట్కు ఐసీసీ విధించిన గడువు రేపటితో ముగియనుండటంతో ఎట్టకేలకు మంగళవారం బీసీసీఐ వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అప్పగించగా.. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాను వైస్ కెప్టెన్గా నియమించింది. విరాట్ కోహ్లీ, జైశ్వాల్, సూర్యకుమార్ యాదవ్, పంత్, దూబే, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, హర్షదీప్ సింగ్, బుమ్రా, సిరాజ్లకు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది.
గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్లకు స్టాండ్ బై ప్లేయర్లుగా సెలెక్ట్ అయ్యారు. అయితే, టీమిండియా వరల్డ్ కప్లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు చోటు దక్కకపోవడం హాట్ టాపిక్గా మారింది. టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్కు, స్టార్ సీనియర్ పేసర్ మహ్మద్ షమీలకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఈ ఇద్దరికి వరల్డ్ స్క్వాడ్లో స్థానం దక్కలేదు. ఐపీఎల్లో లక్నో జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న కేఏల్ రాహుల్తో పాటు భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న మహ్మద్ షమీకి టీ-20 వరల్డ్ జట్టులో చోటు దక్కకపోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏడాది టీ 20 వరల్డ్ కప్కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా అతిథ్యం ఇస్తోన్న విషయం తెలిసిందే. జూన్ 2వ తేదీ నుండి ఈ ధనాధన్ లీగ్ ప్రారంభం కానుంది.