రవి బిష్ణోయ్ స్పిన్ మాయలో జింబాబ్వే విలవిల.. భారత్ టార్గెట్ ఎంతంటే?

by Harish |
రవి బిష్ణోయ్ స్పిన్ మాయలో జింబాబ్వే విలవిల.. భారత్ టార్గెట్ ఎంతంటే?
X

దిశ, స్పోర్ట్స్ : ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య ఇవాళ తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. హరారే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే బ్యాటర్లు భారత బౌలింగ్ ముందు తేలిపోయారు. ముఖ్యంగా రవి బిష్ణోయ్ స్పిన్ మంత్రంతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 115 పరుగులే చేసింది. క్లైవ్ మదాండే(25 నాటౌట్) పోరాటంతో ఆ జట్టు కష్టంగా 100 పరుగులను దాటింది. డియోన్ మైయర్స్(23), బ్రియాన్ బెన్నెట్(23), వెస్లీ మాధెవెరే(21), కెప్టెన్ సికందర్ రజా(17) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. రవి బిష్ణోయ్ 4 వికెట్లతో చెలరేగి జింబాబ్వేను దెబ్బ మీద దెబ్బకొట్టాడు. అతనికితోడు స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లతో సత్తాచాటాడు. దీంతో భారత్ ముందు జింబాబ్వే 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

Advertisement

Next Story

Most Viewed