IND vs WI 3rd T20I: చివర్లో పావెల్ మెరుపుల్.. టీమిండియా టార్గెట్ ఇదే

by Vinod kumar |
IND vs WI 3rd T20I: చివర్లో పావెల్ మెరుపుల్.. టీమిండియా టార్గెట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగుల స్కోరు చేసింది. వెస్టిండీస్‌ ఓపెనర్లు శుభారంభం అందించారు. బ్రెండన్ కింగ్ (42), కైల్ మేయర్స్ (40) కలిసి తొలి వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యం అందించారు. చివర్లో రోవ్‌మన్ పావెల్ (40* 19 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. కైల్ మేయర్స్ (25; 20 బంతుల్లో), నికోలస్ పూరన్ (20; 12 బంతుల్లో) ఫర్వాలేదనిపించారు. దీంతో విండీస్ నిర్ణీత ఓవర్‌లో 159/5 చేసింది. భారత బౌలర్‌లో కుల్దీస్ యాదవ్ 3, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ చెరో వికెట్ తీశారు.

Advertisement

Next Story

Most Viewed