సన్ రైజర్స్ పై ముంబై ఓటమి తర్వాత సచిన్ చెప్పింది ఇదే..!

by Dishanational6 |
సన్ రైజర్స్ పై ముంబై ఓటమి తర్వాత సచిన్ చెప్పింది ఇదే..!
X

దిశ, స్పోర్ట్స్: సన్ రైజర్స్ తో ముంబై ఇండియన్స్ ఓటమి తర్వాత సచిన్ స్పందించాడు. ముంబై ఇన్నింగ్స్ సగం వరకు మ్యాచ్ ఆ జట్టు చేతిలోనే ఉందని అన్నాడు. సన్ రైజర్స్ 277 పరుగులు చేసినప్పటికీ.. ముంబై 10 ఓవర్లు పూర్తయ్యే వరకు స్పష్టమైన విజేత ఎవరో ఎవరూ తేల్చుకోలేకపోయారన్నాడు. ముంబై ఎదుట పెద్ద లక్ష్యం ఉందని.. ముంబై బ్యాటర్లు పోరాడారని అన్నాడు. ఇంకా కష్టతరమైన క్షణాలు రాబోతున్నాయని.. ఐక్యంగా ఉండాలని సూచించాడు. అందరూ కలిసికట్టుగా జట్టు విజయానికి పాటుపడాలని అన్నాడు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సచిన్ చేసిన కామెంట్స్ ని పంచుకుంది ముంబై ఇండియన్స్.

ఇకపోతే ఉప్పల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది హైదరాబాద్. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ బౌలర్లను ఉతికారేశారు. ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. 31 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది.


Next Story