ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-2 వేలంలో భారీ ధర పలికిన హనుమా విహారీ

by Vinod kumar |
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-2 వేలంలో భారీ ధర పలికిన హనుమా విహారీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-2కు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌కు జరిగిన వేలంలో టీమ్ ఇండియా క్రికెటర్ హనుమా విహారీ అత్యధిక ధర పలికారు. రాయలసీమ కింగ్స్ హనుమ విహారి కోసం ఇతర జట్లతో పోటీ పడి చివరికి రూ. 6.60 లక్షలకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఆ తర్వాత ధీరజ్ అనే ప్లేయర్ కోసం గోదావరి టైటాన్స్ రూ. 5 .20 లక్షలు వెచ్చించి దక్కించుకుంది. కాగా గత సీజన్‌లో ఆడిన ఆటగాళ్లను ఆయా జట్లు కొంతమంది రిటైన్ చేసుకోగా.. 580 మంది మాత్రమే వేలంలో పాల్గొనగా 120 మాత్రమే కొనుగోలు చేయబడ్డారు.

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరుతో గత సంవత్సరం ప్రారంభం కాగా రెండవ సీజన్‌కు సంబంధించిన వేలం ప్రక్రియ జరిగింది. ఇండియాలో క్రికెట్‌కు ఏ విధమైన ఆధరణ ఉందో తెలిసిందే. మన దేశంలో దాదాపుగా ప్రతి రాష్ట్రంలో స్థానిక లీగ్‌లు జరుగుతుంటాయి. ఒక్క ఆంధ్రలోనే ఏ లీగ్ లేదు.. అందుకే గత సంవత్సరమే స్టార్ట్ కాగా.. ఇప్పుడు రెండవ సీజన్ జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed