అదరగొట్టిన భారత యువ రెజ్లర్లు.. నాలుగు స్వర్ణాలు కైవసం

by Harish |
అదరగొట్టిన భారత యువ రెజ్లర్లు.. నాలుగు స్వర్ణాలు కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : జోర్డాన్‌లో జరుగుతున్న రెజ్లింగ్ అండర్-17 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్లు సత్తాచాటారు. మహిళల కేటగిరీలో అదితి కుమారి, నేహా, పుల్కిత్, మాన్సి లాథర్ తమ కేటగిరీల్లో వరల్డ్ చాంపియన్లుగా నిలిచారు. 43 కేజీల కేటగిరీ ఫైనల్‌లో అదితి కుమారి 7-0 తేడాతో గ్రీస్‌ రెజ్లర్ మరియా లూయిజా జికికాను చిత్తు చేసి స్వర్ణం దక్కించుకుంది. 57 కేజీల కేటగిరీలో నేహా, 65 కేజీల కేటగిరీలో పుల్కిత్ కూడా గోల్డ్ మెడల్స్ సాధించారు. ఫైనల్‌లో నేహా 10-0 తేడాతో సో సుట్సుయి(జపాన్)ను, పుల్కిత్ 6-3 తేడాతో డారియా ఫ్రొలోవాను మట్టికరిపించారు. ఇక, 73 కేజీల కేటగిరీలో హన్నా పిర్స్కాయను మాన్సి చిత్తు చేసి గోల్డ్ మెడల్ గెలుచుకోవడంతో ఒకే రోజు భారత్ ఖాతాలో నాలుగు స్వర్ణాలు చేరాయి. అలాగే, 69 కేజీల కేటగిరీలో కాజల్, 46 కేజీల కేటగిరీలో శ్రుతిక ఫైనల్‌కు దూసుకెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed