ఆ ముగ్గురి ఆటగాళ్లకు బోనస్‌.. ఐపీఎల్‌లో ఆడనందుకు రివార్డ్

by Vinod kumar |
ఆ ముగ్గురి ఆటగాళ్లకు బోనస్‌.. ఐపీఎల్‌లో ఆడనందుకు రివార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: కాసుల వర్షం కురిపించే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగం కావాలని ప్రపంచంలో ప్రతీ ఒక్క క్రికెటర్‌ కోరుకుంటాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్‌ కంటే తమ జాతీయ జట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఐపీఎల్‌ ఆఫర్‌ను వదులుకున్న బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు షకీబ్‌ అల్‌హసన్‌, లిటన్‌ దాస్‌, టాస్కిన్‌ అహ్మద్‌లకు ఆ దేశ క్రికెట్‌ రివార్డు ప్రకటించింది. ఈ ముగ్గురికీ కలిపి 65 వేల డాలర్లు (దాదాపు 53 లక్షలు) బీసీబీ రివార్డుగా ఇవ్వనుంది.

కాగా ఐపీఎల్ 2023 మినీ వేలంలో బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ని బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లకు కొనుగోలు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొనుగోలు చేసింది. అయితే ఐర్లాండ్‌తో టెస్టు సిరీస్‌ కారణంగా షకీబ్‌ అల్‌హసన్‌ ఐపీఎల్‌-2023 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. అదే విధంగా లిటన్‌ దాస్‌ కూడా ఐర్లాండ్‌ సిరీస్‌ కారణంగా ఈ ఏడాది సీజన్‌ ఫస్ట్‌హాఫ్‌లో ఆడలేదు. లిటన్‌ దాస్‌‌ను కేకేఆర్ రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది. లక్నో ఫాస్ట్‌ బౌలర్‌ స్ధానంలో టాస్కిన్‌ అహ్మద్‌కు ఆ ఫ్రాంచైజీ నుంచి పిలుపు వచ్చిందంట. అయితే బంగ్లా క్రికెట్‌ బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో లక్నో ఆఫర్‌ను టస్కిన్ అహ్మద్‌ తిరష్కరించినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed