సుప్రీంకోర్టులో జగన్ సర్కార్‌కు చుక్కెదురు

by srinivas |
సుప్రీంకోర్టులో జగన్ సర్కార్‌కు చుక్కెదురు
X

దిశ, ఏపీ బ్యూరో: సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. అమరావతి భూములపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. భూముల కొనుగోలు కేసుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. భూముల బదలాయింపు చట్టం ప్రకారం కొనుగోలుదారులు భూములను ఎందుకు కొనుగోలు చేస్తున్నారో అమ్మకందారులకు చెప్పాలన్నారు.

ఈ విషయంలో అమ్మకం దారులు మోసపోయారన్నారు. కొనుగోలుదారు ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై భూములను కొనుగోలు చేశారని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఏపీ ప్రభుత్వం వాదనలతో సుప్రీంకోర్టు విభేదించింది. అనంతరం కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed