కరోనాతో రిటైర్డ్ ఉపాధ్యాయుడు మృతి

by  |
కరోనాతో రిటైర్డ్ ఉపాధ్యాయుడు మృతి
X

దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణానికి చెందిన రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు గోపాల్ రెడ్డి మృతి చెందారు. ఇటీవల గోపాల్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ, భార్యతో కలిసి కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఈ పరీక్షల్లో భార్యాభర్తలిద్దరికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

దీంతో ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల విద్యార్థులు, వ్యాయామ, ఉపాధ్యాయులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.


Next Story