16 లక్షలు దాటిన కరోనా కేసులు

by Anukaran |   ( Updated:2020-07-30 23:20:43.0  )
16 లక్షలు దాటిన కరోనా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 16 లక్షల మార్క్ దాటింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 55,079 కొత్త కేసులు నమోదయ్యాయి. 779 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 16 లక్షల 38 వేల 871 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇందులో 10 లక్షల 57 వేల 806 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 5 లక్షల 45 వేల 318 మంది బాధితులు ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 35 వేల 747 మంది మృతిచెందారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed