ఇండియా ఆత్మను గెలిపించారు

by Ramesh Goud |
ఇండియా ఆత్మను గెలిపించారు
X

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై తనదైన శైలిలో స్పందించారు. ‘‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ‘ఇండియా ఆత్మ’ను గెలిపించారు. అందుకు సహకరించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు’’. అంటూ పీకే ట్వీట్ చేశారు. కాగా, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్టుగా పరిచయమైన ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకూ తన వ్యూహాలతో పలు పార్టీలను విజయ తీరాలకు చేర్చాడు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి పీకే టీం ఎత్తుగడులు అద్భుత ఫలితాలు సాధించాయి.

Advertisement

Next Story