దేశ చరిత్రలో ఇవాళ లిఖించదగిన రోజు : మోడీ

by  |
దేశ చరిత్రలో ఇవాళ లిఖించదగిన రోజు : మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలపడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తంచేశారు. దేశ వ్యవసాయరంగ చరిత్రలో ఇవాళ అద్భుతమైన, లిఖించదగిన రోజని ఆయన పేర్కొన్నారు. ‘దశాబ్దాలుగా రైతులు దళారుల బెదిరింపులకు గురయ్యారని, పార్లమెంటు ఆమోదించిన ఈ బిల్లులతో రైతుల కష్టాలకు విముక్తి’ ఏర్పడిందన్నారు.

అంతేకాకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పుకొచ్చారు. ఇకపై వ్యవసాయరంగంలో టెక్నాలజీని తీసుకుని రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన కోట్లాది రైతులకు ఈ సందర్భంగా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.


Next Story

Most Viewed