నన్ను ఎంతో ప్రోత్సహించేవారు : చిదంబరం

by Shamantha N |
నన్ను ఎంతో ప్రోత్సహించేవారు : చిదంబరం
X

దిశ, వెబ్ డెస్క్:
పీవీ నరసింహారావు తనను రాజకీయాల్లో ఎంతో ప్రోత్సహించేవారని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తెలిపారు. ఆయనతో తనకు ఎంతో మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ శత జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న తనను, ఎంపీగా, పీసీసీగా చాలా ప్రోత్సహించారని చిదంబరం గుర్తుచేసుకున్నారు. ఆర్థిక సంస్కరణల రూపకర్త పీవీ అని కొనియాడారు. పీవీ పారిశ్రామిక విధానం మరువలేనిది కొనియాడారు. దివంగత మాజీ ప్రధాని పీవీ ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేశారని స్పష్టంచేశారు.

Advertisement
Next Story

Most Viewed