బైకును ఢీకొన్న లారీ.. ఒకరి మరణం, ఇద్దరు..

by Shyam |
బైకును ఢీకొన్న లారీ.. ఒకరి మరణం, ఇద్దరు..
X

దిశ, రామాయంపేట : రామాయంపేట శివారులోని దామరచెరువు ఎక్స్‌రోడ్ 44 హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందగా, ఇద్దరు గాయపడ్డారు. రామాయంపేట ఎస్ఐ రాజేష్ కథనం ప్రకారం నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన మల్లమారి శ్రీనివాస్, భార్య రాజ్యలక్ష్మి, కూతురు మహేశ్వరితో కలిసి బైక్‌పై శనివారం సిద్దిపేట నుంచి వారి స్వగ్రామానికి వస్తున్నారు. మార్గమధ్యలో రామాయంపేట శివారులోని దామరచెరువు ఎక్స్‌రోడ్ వద్ద గల 44 హైవే రోడ్డుపైకి వచ్చేసరికి వారి బైక్‌ను హైదరాబాద్ నుంచి వస్తున్న లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజ్యలక్ష్మి (40) రెండు కాళ్లపై నుంచి లారీ వెళ్లింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా దారిమధ్యలో మృతి చెందింది. ఈ ఘటనలో శ్రీనివాస్, మహేశ్వరిలు గాయపడ్డారు. మృతురాలి భర్త శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed