- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇండియా నుంచి రాకపోకలపై న్యూజిలాండ్ నిషేధం

X
వెల్లింగ్టన్: మనదేశం నుంచి రాకపోకలపై న్యూజిలాండ్ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అడర్న్ ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్ నుంచి న్యూజిలాండ్కు వెళ్లాలనుకునే ఆ దేశ వాసులకూ ఈ నిబంధన వర్తిస్తుందని వివరించారు. ఈ నెల 11 నుంచి 28వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు. ఈలోగా సురక్షితంగా రాకపోకలు నిర్వహించడానికి మార్గాలను అన్వేషిస్తామని వివరించారు. కరోనా కట్టడిలో గతేడాది న్యూజిలాండ్ ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం ఇక్కడ వారానికి సగటున ఐదు కొత్త కేసులు నమోదవుతున్నాయి.
Next Story