Manipur : విచక్షణారహితంగా మిలిటెంట్ల కాల్పులు.. మహిళ మృతి, నలుగురికి గాయాలు

by Hajipasha |
Manipur : విచక్షణారహితంగా మిలిటెంట్ల కాల్పులు.. మహిళ మృతి, నలుగురికి గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్‌లో హింసాకాండ ఇంకా పూర్తిగా ఆగలేదు. తాజాగా ఆదివారం మధ్యాహ్నం పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని కౌత్రుక్ ఏరియా వద్ద సాయుధ దుండగులు చెలరేగారు. వారు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఓ మహిళ చనిపోయింది. సదరు మహిళ కుమార్తె, పోలీస్ కమాండో సహా నలుగురికి గాయాలయ్యాయి.

చనిపోయిన మహిళ కుమార్తె కుడిచేయిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో కొంచెంలో ప్రాణాపాయం తప్పింది. ఆమెకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన కౌత్రుక్ ఏరియాకు చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలీసులు, సాయుధ దుండగుల మధ్య కాల్పులు, ప్రతికాల్పులు కొనసాగాయి.

Advertisement

Next Story

Most Viewed