- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Manipur : విచక్షణారహితంగా మిలిటెంట్ల కాల్పులు.. మహిళ మృతి, నలుగురికి గాయాలు
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్లో హింసాకాండ ఇంకా పూర్తిగా ఆగలేదు. తాజాగా ఆదివారం మధ్యాహ్నం పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని కౌత్రుక్ ఏరియా వద్ద సాయుధ దుండగులు చెలరేగారు. వారు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఓ మహిళ చనిపోయింది. సదరు మహిళ కుమార్తె, పోలీస్ కమాండో సహా నలుగురికి గాయాలయ్యాయి.
చనిపోయిన మహిళ కుమార్తె కుడిచేయిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో కొంచెంలో ప్రాణాపాయం తప్పింది. ఆమెకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన కౌత్రుక్ ఏరియాకు చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలీసులు, సాయుధ దుండగుల మధ్య కాల్పులు, ప్రతికాల్పులు కొనసాగాయి.
Advertisement
Next Story