- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Uttarakhand : బస్సులో బాలికపై సామూహిక లైంగిక దాడి కేసు.. ఐదుగురు అరెస్టు
దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉన్న అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ వద్ద ప్రభుత్వ బస్సులో మైనర్ బాలికపై ఆగస్టు 13న తెల్లవారుజామున జరిగిన సామూహిక లైంగిక దాడి కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఆ కేసుతో సంబంధమున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు ఆదివారం వెల్లడించారు. వారికి వ్యతిరేకంగా ఆధారాలను సేకరించడంపై ప్రస్తుతం తాము ఫోకస్ చేస్తున్నట్లు డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) అజయ్ సింగ్ తెలిపారు.
తాము జారీ చేస్తున్న ప్రెస్ రిలీజ్ ఆధారంగానే ఈ ఘటనకు సంబంధించిన వార్తలను ప్రచురించాలని మీడియాకు ఆయన సూచించారు. ఎవరైనా అంతకుమించిన వివరాలతో అపోహలను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఐదుగురు వ్యక్తులు కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వ రవాణా సంస్థ ఉద్యోగులే. వీరిలో ముగ్గురు డ్రైవర్లు, ఒక బస్సు కండక్టర్, ఒక క్యాషియర్ ఉన్నారు.