Breaking: పార్లమెంట్‌లో ‘కేంద్ర బడ్జెట్’ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్

by srinivas |
Breaking: పార్లమెంట్‌లో  ‘కేంద్ర బడ్జెట్’ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్‌లో ‘కేంద్ర బడ్జెట్’ను కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశ పెట్టారు. లోక్‌సభలో ఏడోసారి బడ్జెట్ ప్రవేశ‌పెట్టారు. ప్రజల ఆంకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ప్రిపేర్ చేశామని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యంగా 3.0 బడ్జెట్‌ను తయారు చేశామని నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందని, ద్రవ్యోల్బణం తగ్గుతోందని ఆమె తెలిపారు. నాలుగు అంశాలపై బడ్జెట్‌లో దృష్టి పెట్టినట్లు ఆమె చెప్పారు. ఉద్యోగం, స్కిల్, ఎమ్మెస్‌ఎమ్ఈపై పూర్తిగా దృష్టి పెట్టామన్నారు. రానున్న ఐదేళ్లలో 4 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని నిర్మలా స్పష్టం చేశారు. కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ పథకం వర్తింపజేస్తామన్నారు. విద్యా, నైపుణ్యాభివృద్ధికి రూ. లక్షా48 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.



Next Story