రేపు మరో రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభం

by M.Rajitha |
రేపు మరో రెండు వందే భారత్ రైళ్లు ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్ : మరో రెండు వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ రైళ్లలో ఒకటి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి నాగర్ కోయిల్ వరకు, మరోటి మధురై నుండి బెంగుళూరు కంటోన్మెంట్ వరకు నడవనున్నాయి. ఆగస్ట్ 31న వీటిని ప్రధాని వర్చువల్ గా ప్రారంభిస్తారని రైల్వే అధికారులు ప్రకటించారు. కాగా చెన్నై సెంట్రల్ నుండి నాగర్ కోయిల్ మధ్య తిరిగే రైలు ప్రతి బుధవారం మినహా అన్ని రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఇది ఉదయం 5 గంటలకు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి బయల్దేరి మధ్యాహ్నం 1.50కి నాగర్ కోయిల్ చేరుకుంటుంది. తిరిగి 2.20కి అక్కడి నుండి బయల్దేరి రాత్రి 11 గంటలకు చెన్నై చేరుకుంటుంది. అలాగే మధురై నుండి బెంగుళూరు మధ్య తిరిగే రైలు ప్రతి మంగళవారం మినహా అన్ని రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. మధురై నుండి 5.15కి బయల్దేరి, మధ్యాహ్నం 1 గంటలకు బెంగుళూరు చేరుకుంటుంది. తిరిగి 1.30కి బెంగుళూరు నుండి బయల్దేరి రాత్రి 9.45కు మధురై చేరుకుంటుంది.

Next Story