అలీఘర్ హత్య కేసులో ట్విస్ట్..బాధితుడిపై చోరీ ఆరోపణలు!

by vinod kumar |
అలీఘర్ హత్య కేసులో ట్విస్ట్..బాధితుడిపై చోరీ ఆరోపణలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఇటీవల జరిగిన హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరణించిన బాధితుడితో పాటు మరో ఎనిమిది మందిపై దోపిడీ ఆరోపణల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలీఘర్‌లోని మము భంజా ప్రాంతంలో ఈ నెల 18న కొందరు దుండగులు మొహమ్మద్ ఫరీద్ అలియాస్ ఔరంగజేబ్‌ అనే వ్యక్తిని హత్య చేశారు. అనంతరం ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే జూన్ 18న రాత్రి ఫరీద్ తన ఇంట్లోకి చొరబడి, విలువైన వస్తువులను దోచుకున్నాడని, నన్ను వేధించడానికి ప్రయత్నించాడని ఓ మహిళ ఆరోపించింది. తన కుటుంబ సభ్యులు అతనిని వెంబడించడంతో, అతను బ్యాలెన్స్ కోల్పోయి మెట్లపై నుంచి పడిపోయి గాయాలతో మరణించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దోపిడీ కేసు నమోదు చేశారు. అయితే ఫరీద్ కుటుంబ సభ్యులు మాత్రం పని మీద బయటకు వెళ్లిన ఫరీద్ ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో కొంతమంది దాడి చేశారని ఆరోపిస్తోంది. కాగా, ఈ కేసు రాజకీయ వివాదానికి దారి తీసింది. ఫరీద్‌ను హత్య చేసిన గుంపుపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ కేసులో నిజమైన బాధితులు మిట్టల్ కుటుంబానికి అండగా నిలబడాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు.

Next Story

Most Viewed