రామనవమి వేడుకలపై బాంబు దాడి..! 20 మందికి గాయాలు

by Disha Web Desk 12 |
రామనవమి వేడుకలపై బాంబు దాడి..! 20 మందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామ నవమి వేడుకలపై కొంతమంది అల్లరి మూకలు బాంబు దాడి చేయగా 20 మంది రామభక్తులకు గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లోని రెజీనగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం రామ నవమి ఊరేగింపు వెళ్తున్న సమయంలో ఓ ఇంటి పై నుంచి అల్లరి మూకలు రాళ్లు విసిరారు. ఈ క్రమంలోనే ఓ నాటుబాంబులు కూడా విసరడంతో ఒక్కసారిగా అది పేలింది. దీంతో 20 మంది రామ భక్తులకు గాయలు కాగా ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ముర్షిదాబాద్‌ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తవాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి.. అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఘటనను ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పోలీసులు స్పందించి.. రాళ్లదాడి మాత్రమే జరిగిందనే బాంబుదాడి జరిగిందా లేదా అనే విషయాలు త్వరలో తెలుస్తాయని చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed