- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రామనవమి వేడుకలపై బాంబు దాడి..! 20 మందికి గాయాలు
దిశ, వెబ్డెస్క్: శ్రీరామ నవమి వేడుకలపై కొంతమంది అల్లరి మూకలు బాంబు దాడి చేయగా 20 మంది రామభక్తులకు గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లోని రెజీనగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం రామ నవమి ఊరేగింపు వెళ్తున్న సమయంలో ఓ ఇంటి పై నుంచి అల్లరి మూకలు రాళ్లు విసిరారు. ఈ క్రమంలోనే ఓ నాటుబాంబులు కూడా విసరడంతో ఒక్కసారిగా అది పేలింది. దీంతో 20 మంది రామ భక్తులకు గాయలు కాగా ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ముర్షిదాబాద్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తవాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి.. అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఘటనను ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పోలీసులు స్పందించి.. రాళ్లదాడి మాత్రమే జరిగిందనే బాంబుదాడి జరిగిందా లేదా అనే విషయాలు త్వరలో తెలుస్తాయని చెప్పుకొచ్చారు.