నాన్న-తాత పరువును నిలబెట్టే వారసురాలు సితారనే..గౌతమ్‌కి మాత్రం ఆ అలవాటు రాలేదు

by Dishafeatures1 |
నాన్న-తాత పరువును నిలబెట్టే వారసురాలు సితారనే..గౌతమ్‌కి మాత్రం ఆ అలవాటు రాలేదు
X

దిశ,సినిమా: తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఫ్యామిలీకి ఎంత క్రేజ్ ఉందో మన అందరికీ తెలిసిందే. ఇక ముఖ్యంగా మహేష్ బాబు తన తండ్రి కృష్ణ గారి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి ఘట్టమనేని పేరు నిలబెట్టారు. ఆ తర్వాత ఆ బాధ్యతలు గౌతమ్ తీసుకుంటాడు అని ఫ్యాన్స్ అనుకున్నారు ..కానీ గౌతమ్ కి సినిమా ఇండస్ట్రీలోకి రావాలనే ఇంట్రెస్ట్ ఏ లేదట .

ఆ బాధ్యతలను మహేష్ బాబు కూతురు సితార తీసుకోబోతున్నట్లు,త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే మహేష్ బాబు - కృష్ణ ఎంత యాక్టివ్ గా ఇంటర్వ్యూస్ లో మాట్లాడుతూ ఉంటారో..సరదాగా నవ్విస్తూ ఉంటారో మనకు తెలిసిందే. మన మహేష్ బాబుకి కొంచెం సమయం దొరికితే చాలు ఫ్యామిలీకి సమయం కెటాయిస్తాడు. బయట వాళ్ళతో అంతగా మింగిల్ కాకపోయిన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో,బాగా తెలిసిన వారితో చాలా బాగా మింగిల్ అవుతూ ఉంటారు . అయితే గౌతమ్ కి మాత్రం ఆ క్వాలిటీ రాలేదు అంటున్నారు కుటుంబ సభ్యులు .

మొదటి నుంచి గౌతమ్ చాలా సైలెంట్.. అంతేకాదు ఎక్కడ కూడా పెద్దగా అందరితో మింగిల్ అవ్వకుండా తన పని తాను చేసుకొని వెళ్ళిపోయే టైప్. అయితే సితార మాత్రం ఘట్టమనేని కుటుంబానికి తగ్గ తనయురాలు అనిపించుకుంటుంది. సితార ఘట్టమనేనికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ విషయాలు, రీల్స్, డాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. అంతకు ముందు యూట్యూబ్ లో సొంతంగా ఛానల్ స్టార్ట్ చేసి చిన్నారులకు సంబంధించిన వీడియోస్ షేర్ చేసేది. ప్రస్తుతం సితారకు ఇన్ స్టాలో 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు నాన్న తాత పరువును నిలబెట్టే వారసురాలు సితారనేని అంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.

Next Story

Most Viewed