తీహార్ జైలు బాత్రూంలో కాలు జారి పడ్డ మాజీ మంత్రి.. ఆస్పత్రికి తరలింపు

by Mahesh |
తీహార్ జైలు బాత్రూంలో కాలు జారి పడ్డ మాజీ మంత్రి.. ఆస్పత్రికి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: మనీలాండరీంగ్ కేసులో అరెస్టు అయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ బాత్రూంలో కాలు జారిపడిపోయారు. ఈ విషయాన్ని జైలు అధికారులు స్వయంగా తెలిపారు. అలాగే.. జైన్‌ను చెకప్‌ల కోసం ఢిల్లీలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు తెలిపారు. అయను స్వల్ప గాయాలు అయినట్లు డాక్టర్లు చెప్పడంతో చికిత్స అందించి తిరిగి తీహార్ జైలుకు తరలించామని జైలు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed