హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ప్రారంభమైన సమీక్ష.. హాజరుకాని ఏపీ సీఎం

by Y.Nagarani |   ( Updated:2024-10-07 05:53:54.0  )
హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ప్రారంభమైన సమీక్ష.. హాజరుకాని ఏపీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రహోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన.. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమీక్ష ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీహార్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు హాజరవ్వగా.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాలేదు. ఏపీ తరఫున హోంమంత్రి అనిత, సీఎస్ నీరభ్ ప్రసాద్, డీజీపీ హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎంలతో పాటు కేంద్రమంత్రులు జేపీ నడ్డా, నిత్యానందరాయ్, జుయెల్ ఓరం, సంబంధిత శాఖకు చెందిన కేంద్ర అధికారులు కూడా హాజరయ్యారు. 2026 నాటికి ఆయా రాష్ట్రాల్లో నక్సలిజాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఈ సమీక్ష జరుగుతోంది. రాష్ట్రాల్లో మావోయిస్టుల కట్టడి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి, కార్యాచరణ, రాష్ట్రాల భాగస్వామ్యంపై చర్చిస్తున్నారు.




Advertisement

Next Story

Most Viewed