వెంకయ్యపై మూడు పుస్తకాలు.. నేడు ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ

by Hajipasha |
వెంకయ్యపై మూడు పుస్తకాలు.. నేడు ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు‌ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంపై పలువురు ప్రముఖులు రాసిన మూడు పుస్తకాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ విడుదల చేయనున్నారు. ఆదివారం రోజు హైదరాబాద్​ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్​లో జరగనున్న కార్యక్రమం వేదికగా ఈ పుస్తకాలను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మోడీ ఆవిష్కరించనున్నారు. వీటిలో ఓ పుస్తకాన్ని ‘ది హిందూ’ పత్రిక హైదరాబాద్​ ఎడిషన్ మాజీ ఎడిటర్​ ఎస్​ నగేశ్​ కుమార్ రాశారు. ఈ బుక్ పేరు ‘వెంకయ్య నాయుడు- లైఫ్​ ఇన్​ సర్వీస్’. ‘సెలబ్రేటింగ్ భారత్​- ది మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ ఇండియా’ అనే టైటిల్​ కలిగిన మరో బుక్‌ ఒక ఫొటో క్రానికల్. ఇందులోని ఫొటోలన్నీ వెంకయ్యనాయుడు‌ మాజీ కార్యదర్శి సుబ్బారావు సంకలనం చేశారు. ‘మహానేత- లైఫ్​ అండ్​ జర్నీ ఆఫ్​ శ్రీ ఎం వెంకయ్య నాయుడు’ పేరు కలిగిన ఇంకో పుస్తకాన్ని సంజయ్​ కిషోర్​ రచించారు.

Advertisement

Next Story

Most Viewed