Noida: రూ.4 కోట్ల కరెంట్ బిల్లు చూసి షాక్..!

by Shamantha N |
Noida: రూ.4 కోట్ల కరెంట్ బిల్లు చూసి షాక్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) నోయిడాలో రైల్వే ఉద్యోగి(Railways) బసంత్‌శర్మకు జూన్‌ నెల కరెంటు బిల్లు షాక్‌ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ విద్యుత్ బోర్డు నుండి గురువారం షాకింగ్ సందేశం వచ్చింది. మూడు నెలల కరెంటు బిల్లు రూ.4 కోట్లకు పైగా ఉందని పేర్కొంది. ఏకంగా రూ.4 కోట్ల కరెంటు బిల్లు(Current Bill) కట్టాలని మెసేజ్‌ వచ్చింది. బిల్లును జూలై 24న లేదా అంతకు ముందు చెల్లించాలని.. తద్వారా అతను రూ.2,84,969.88 తగ్గింపును పొందవచ్చని మెసేజ్ లో ఉంది. అది చూసి తొలుత ఆశ్చర్యపోయి.. ఆ తర్వాత కంగారుపడ్డాడు. టెనెంట్‌కు ఫోన్‌ చేసి కనుక్కుంటే సాధారణ గృహోపకరణాలే వాడినట్లు సమాధానం వచ్చింది. దీంతో, బసంత్ శర్మ విద్యుత్ అధికారులను సంప్రదించారు. వారు చెక్ చేసి చూడగా కంప్యూటర్ ఎర్రర్ వల్ల ఆ సందేశం వచ్చిందని తేల్చారు. కంప్యూటర్‌ జనరేటెడ్‌ బిల్లులో పొరపాటు వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. బిల్లును సరిచేసి పంపడంతో బసంత్‌ శర్మ ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత గురువారం బిల్లును సరిచేసి.. రూ. 26 వేల బిల్లును బసంత్ శర్మకు పంపారు.

Advertisement

Next Story

Most Viewed