- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సినీ ఇండస్ట్రీని వీడేది లేదు.. తేల్చిచెప్పేసిన కంగనా
దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ను హిమాచల్ లోని మండి నుంచి బరిలో దింపింది బీజేపీ. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉంది కంగనా. అయితే.. సినీ ఇండస్ట్రీని వీడేది లేదని ఆమె చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా సినిమాలు పెండింగ్ లో ఉన్నాయని.. ప్రస్తుతం సినీ పరిశ్రమను విడిచిపెట్టలేనని స్పష్టం చేశారు. మండి నుంచి పోటీ చేయాలని కంగనా తీసుకున్న నిర్ణయంతో హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ కుంచుకోటగా మండి స్థానానికి పేరుంది. అయితే, ఈ స్థానం నుంచి కంగనా పోటీ చేయడం ఆమెకు ఓ సవాల్ అనే చెప్పొచ్చు.
జూన్ 1న హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 4 లోక్ సభ స్థానాలతో సహా.. అనర్హత వేటుతో ఖాళీ అయిన 6 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ప్రాంతంలో ఆధిపత్యాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. హిమాచల్ లోని 4 లోక్ సభ స్థానాలను 2019లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది.