వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో పాల్గొన్న నరేంద్ర మోడీ

by Mahesh |   ( Updated:2025-03-29 10:04:16.0  )
వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో పాల్గొన్న నరేంద్ర మోడీ
X

దిశ, వెబ్‌డెస్: ఓ ప్రముఖ మీడియా నెట్‌వర్క్ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని మోడీకి మైహోం గ్రూప్‌ ఛైర్మన్‌ రామేశ్వరరావు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఇద్దరూ ఆసీనులయ్యారు. వాట్‌ ఇండియా థింక్స్ టుడే వంటి వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారత దేశం నేడు ఏం ఆలోచన చేస్తోందనని యావత్‌ ప్రపంచం ఆసక్తిగా చూస్తోందని అన్నారు.

వరల్డ్ ఆర్డర్‌లో భారతదేశం కేవలం పాల్గొనడం మాత్రమే కాదు.. భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, పదిలపరచడంలోనూ తోడ్పాటు అందిస్తోందని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. భారతదేశ గతాన్ని, వర్తమానాన్ని పోల్చుతూ అనేక అంశాలను ప్రధాని ఉదహరించారు. న్యూస్ ఛానల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వాట్‌ ఇండియా థింక్స్ టుడే శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని మోదీకి మైహోం గ్రూప్‌ ఛైర్మన్‌ రామేశ్వరరావు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.

ఈ సమ్మిట్‌లో మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ జూపల్లి రాము రావు ప్రసంగించి కీలక అంశాలను ప్రస్తావించారు. భారత ప్రధాని మోడీ నాయకత్వంలో జరిగిన ఆర్థిక పురోగతి ప్రయత్నాల గురించి ఈ సందర్భంగా వివరించారు. ప్రపంచ బ్యాంకు, IMF డేటా ప్రకారం.. రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ప్రపంచం భారతదేశం వైపు చూస్తోందని అన్నారు. పీఎం గతి శక్తి, స్టార్టప్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు వంటి కార్యక్రమాలు.. తయారీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి వాటిలో మార్పునకు దారితీస్తున్నాయన్నారు.

డిజిటల్ ఇండియాలో చూపిస్తున్న చొరవ.. అభివృద్ధి చెందిన దేశాలకు కూడా ఆదర్శంగా మారుతోందని మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ రాము రావు అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం.. అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని ఆయన అన్నారు. డిజిటల్ ఇండియా దార్శనికత దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. మోదీ నాయకత్వంలో భారతదేశం ఒక మార్గదర్శి పాత్రను పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 1.45 బిలియన్ల భారతీయుల ఆకాంక్షలకు బలమైన దిశానిర్దేశం చేయడం, ప్రపంచ వృద్ధికి భారతదేశం ప్రధానంగా మారడం ద్వారా తాను ఎంతో ప్రేరణ పొందానని అన్నారు. భారతదేశ పురోగతిని ప్రపంచ బ్యాంకు, IMF కూడా అంగీకరిస్తున్నాయని చెప్పారు.



Next Story

Most Viewed