- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మాస్కో ఉగ్రదాడిలో 115 మంది మృతి.. నలుగురు అరెస్టు..!
దిశ, నేషనల్ బ్యూరో: రష్యాలో భీకర ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో మృతుల సంఖ్య 115కి చేరగా.. అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తెలిపారు. బ్రయాన్స్క్ ప్రాంతంలో ఛేజ్ చేసి మరీ అనుమానితులను పట్టుకున్నట్లు సమాచారం. రష్యా భద్రత సంస్థ పుతిన్ కు దీనిపై వివరణ ఇచ్చినట్లు రష్యన్ మీడియా సంస్థ టాస్ పేర్కొంది.
మాస్కోలోని క్రాస్నోగోర్స్క్లో ఉన్న క్రాకస్ సిటీ హాల్లో షాపింగ్ మాల్, డయాస్ ఉంది. రష్యన్ రాక్ బ్యాండ్ పిక్నిక్ షోకు భారీగా ఫ్యాన్స్ హాజరయ్యారు. ఈ టైంలోనే దుండగులు వారిపైన దారుణంగా కాల్పులు జరిపారు. బాంబులు విసిరారు. తప్పించుకునేందుకు చాలా మంద్రి సీట్ల వెనుక దాక్కోగా.. మరికొందరు ఎంట్రెన్స్ వైపు పరుగులు తీశారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపినట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈదాడుల్లో మంటలు చెలరేగి.. కొద్దిసేపటికే హాల్ పైకప్పు కూలిపోయింది. హెలికాప్టర్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.