Narendra Modi : బీజేపీ ముఖ్యనేతలతో మోదీ కీలక భేటీ

by Javid Pasha |
Narendra Modi : బీజేపీ ముఖ్యనేతలతో మోదీ కీలక భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ప్రధాని మోదీ ఫోకస్ పెట్టారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను సెమీఫైనల్‌గా పార్టీలన్నీ భావిస్తున్నాయి. ఈ ఎన్నికల ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పడే అవకాశం ఉంటుంది. దీంతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈ క్రమంలో బీజేపీని గెలిపించేందుకు నేరుగా ప్రధాని మోదీ రంగంలోకి దిగారు.

శుక్రవారం రాత్రి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది. ఈ భేటీలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొననున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ కీలక భేటీలో తెలంగాణ ఎన్నికల అభ్యర్థుల ఖరారుపై చర్చించే అవకాశముంది. అభ్యర్థుల జాబితా ప్రకటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. దీంతో రేపు తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే 30-40 అభ్యర్థులతో టీ బీజేపీ తొలి జాబితా సిద్దమైంది. ఏ క్షణమైనా జాబితాను విడుదల చేసే అవకాశముంది. మోదీ ఈ సమావేశంలో పాల్గొనడం కీలకంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed