వాహనం ఢీకొన్నదని ఇద్దరి మధ్య గొడవ... ఆపై కత్తులతో ఫైటింగ్... (వీడియో)

by S Gopi |
వాహనం ఢీకొన్నదని ఇద్దరి మధ్య గొడవ... ఆపై కత్తులతో ఫైటింగ్... (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో రోడ్డుపై జరిగిన గొడవలో 25 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడు సాహిల్ మాలిక్ గా గుర్తించారు. సాహిల్ పై కొంతమంది కత్తులతో దాడి చేసిన ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. మంగళవారం సాయంత్రం నాంగ్లోయ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ మినీ బస్సుకు బైక్ తాకడంతో వారి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలో సాహిల్ పై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారని, దీంతో తీవ్ర గాయాలతో సాహిల్ మృతిచెందాడని మృతుడి బంధువులు తెలిపినట్లు అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story