- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కేజ్రీవాల్ కస్టడీ కేసుపై కోర్టులో విచారణ.. మద్యం తీసుకొచ్చి హల్ చల్ చేసిన వ్యక్తి
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు మద్యం సీసా తీసుకొచ్చి వ్యక్తి హల్ చల్ చేశాడు. లిక్కర్ స్కాం కేసులో ఈడీ కస్టడీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ను కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఆ టైంలోనే రౌజ్ అవెన్యూ కోర్టు ఎదుట గొడవ జరిగింది. కోర్టు అవరణలోకి మద్యం తీసుకొచ్చి గొడవ చేసేందుకు యత్నించాడు. ఆ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇకపోతే కేజ్రీవాల్ కస్టడీని పొడగించాలన్న ఈడీ వినతిని రౌజ్ అవెన్యూ కోర్టు అందుకు అంగీకరించింది. ఈడీ మరో 7 రోజులు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరగా.. కోర్టు మరో 4 రోజులు కస్టడీని పొడగించింది. ఏప్రిల్ 1 వరకు ఆయన రిమాండ్ని పొడగించింది. కేజ్రీవాల్ భార్యకు చెందినదిగా భావిస్తున్న ఒక ఫోన్లోని డాటాను వెలికితీసినట్లు, విశ్లేషిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. మార్చి 21న కేజ్రీవాల్ నివాసం నుంచి సీజ్ చేసిన 4 డిజిటల్ డివైజెస్ నుంచి ఇంకా సమాచారం సేకరించలేదని ఈడీ పేర్కొంది. కేజ్రీవాల్ ఈ వివరాలను అందించడానికి తన న్యాయవాదులను సంప్రదించేందుకు సమయం కోరారు.
VIDEO | Police detain a man who brought liquor in the premises of Rouse Avenue Court, where Delhi CM Arvind Kejriwal is being produced in connection with the excise policy case. pic.twitter.com/deqrsD2RZ9
— Press Trust of India (@PTI_News) March 28, 2024