జూన్ 1న ఇండియా కూటమి భేటీకి రాలేను : మమతా బెనర్జీ

by Hajipasha |
జూన్ 1న ఇండియా కూటమి భేటీకి రాలేను : మమతా బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో : విపక్ష ఇండియా కూటమి జూన్ 1న ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ మీటింగ్‌కు రావాల్సిందిగా కూటమిలోని అన్ని పార్టీలకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఇప్పటికే సమాచారాన్ని అందించారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలకు దూరంగా ఉండిపోయారు. ఆ రెండు పార్టీలపై విమర్శలు కూడా గుప్పించారు. దీంతో ఇండియా కూటమి సమావేశానికి ఆమె హాజరవుతారా ? లేదా ? అనే దానిపై నెలకొన్న సస్పెన్స్‌కు తాజాగా సోమవారం దీదీ తెరదించారు. జూన్ 1 కూటమి భేటీకి తాను రాలేనని మమత తేల్చి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తుది విడత ఘట్టంలో బిజీగా ఉండటం, రెమాల్ తుఫానుతో బెంగాల్ ప్రభావితం అవుతున్నందున రాష్ట్రం వదిలి వచ్చే పరిస్థితి లేదని దీదీ స్పష్టం చేశారు. కాగా, ఎన్నికల ఫలితాలు వచ్చాక బయటి నుంచి ఇండియా కూటమికి మద్దతు ఇస్తానని గతంలోనే మమతా బెనర్జీ ప్రకటించారు.



Next Story