Liquor Policy Case: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ కస్టడీ పొడగింపు..

by Vinod kumar |
Liquor Policy Case: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ కస్టడీ పొడగింపు..
X

న్యూఢిల్లీ: ‘ఢిల్లీ లిక్కర్ స్కాం’కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీని, ఢిల్లీ కోర్టు ఈ నెల 27వరకు పొడిగించింది. అంతకుముందు, న్యాయస్థానం ఇచ్చిన కస్టోడియల్ కస్టడీ గడువు ముగియడంతో దర్యాప్తు సంస్థ సంజయ్‌ సింగ్‌ను తాజాగా కోర్టు ముందు హాజరుపర్చింది. కేసును విచారించిన స్పెషల్ జడ్జి ఎంకే నాగ్‌పాల్.. వాదనల అనంతరం సంజయ్‌ను జైలుకు పంపించారు. కాగా, సంజయ్ సింగ్‌ను ఈడీ ఈ నెల 4న అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story