- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Kerala Assembly: కేరళ అసెంబ్లీ కీలక నిర్ణయం..
తిరువనంతపురం: ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)ని వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం తీసుకొచ్చేందుకు చేస్తున్న చర్యలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు యూసీసీకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని సీఎం పినరయి విజయన్ సభలో ప్రవేశపెట్టారు. దేశంలో యూసీసీ అమలు చేయాలనుకోవడం ఏకపక్షమని, ఇది తొందరపాటు చర్య అని కేంద్రాన్ని విమర్శించారు.
సంఘ్ పరివార్ సిఫార్సు చేసిన యూసీసీ రాజ్యాంగం ప్రకారం లేదని, ‘మనుస్మృతి’పై ఆధారపడి ఉందని ఆరోపించారు. ఈ తీర్మానానికి సీపీఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ కూటమితోపాటు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి యూడీఎఫ్ సైతం మద్దతు ప్రకటించడంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మిజోరం అసెంబ్లీ సైతం యూసీసీకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే.