- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Train Accidents : రైలు ప్రమాదాల వెనుక భయంకరమైన కుట్ర కోణాలు : రైల్వేశాఖ సహాయమంత్రి బిట్టు
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : ఇటీవలే దేశంలో జరిగిన రైలు ప్రమాదాలపై జరిపిన విచారణలో కొన్ని భయంకరమైన విషయాలు, కుట్ర కోణాలు వెలుగుచూశాయని రైల్వేశాఖ సహాయమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు పేర్కొన్నారు. అలీగఢ్లో ఉన్న రైల్వే ట్రాక్పై శుక్రవారం రోజు ఒక అలాయ్ వీల్ను గుర్తించామని ఆయన తెలిపారు. దీన్నిబట్టి రైలు ప్రమాదాల వెనుక కుట్ర కోణాలు ఉన్నాయనే అనుమానాలకు బలం చేకూరుతోందని బిట్టు ఆరోపించారు.
ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నరేంద్రమోడీ మూడోసారి భారత ప్రధాని అయ్యారనే అక్కసుతో విదేశాల్లో ఉన్న కొందరు వ్యక్తులు భారత జీవనరేఖ లాంటి రైల్వే వ్యవస్థకు ఆటంకం కలిగించే కుట్రలు పన్నుతున్నారు’’ అని బిట్టు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కొందరు పన్నిన కుట్రల వల్లే ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు జరిగాయన్నారు.
Advertisement
Next Story