ఇండియా కూటమి మిత్రపార్టీ వీఐపీ అధినేత తండ్రి దారుణ హత్య

by Shamantha N |
ఇండియా కూటమి మిత్రపార్టీ వీఐపీ అధినేత తండ్రి దారుణ హత్య
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ లోని దర్భంగా జిల్లాలో వికాశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) అధినేత ముఖేష్ సహానీ తండ్రి జితన్ సహానీ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన నివాసంలోని బెడ్ పైన జితన్ సహానీ మృతదేహం లభ్యమైంది. హత్య జరిగినట్లు దర్భంగా సీనియర్ అధికారి జగన్నాథ్ రెడ్డి ధ్రువీకరించారు. చోరీ ఉద్దేశంతో సహానీల ఇంట్లోకి ప్రవేశించారని.. జితన్ ప్రతిఘటించడంతో హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని మరో అధికారి మనీష్ చంద్ర చౌదరి తెలిపారు. అయితే, హత్యకు సంబంధించిన కేసులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. జితన్ నివాసం దగ్గర పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన వల్ల స్థానికులు భయాందోళనకు గురయినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు విచారణ చేపట్టేందుకు ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇకపోతే, ముఖేష్ సుహానీ మాజీ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం వీఐపీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. ఈ పార్టీకి ఓబీసీ కమ్యూనిటీలో బలమైన మద్దతు ఉంది.

Advertisement

Next Story

Most Viewed