- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sunita Williams: మేం భూమి మీదకు ఎప్పుడు వస్తామో కచ్చితంగా తెలియదు- సునితా విలియమ్స్

దిశ, నేషనల్ బ్యూరో: భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్(Sunita Williams) గత 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఆమెతో పాటు వెళ్లిన బచ్ విల్మోర్ (Butch Wilmore) కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కాగా.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ISS) నుంచి వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. సునితా మాట్లాడుతూ.. ‘‘మేము భూమిమీదకు తిరిగి వచ్చే విషయంలో నెలకొన్న అనిశ్చితి చాలా కష్టమైన అంశం. భూమిపై ఉన్న వారికి మేం ఎప్పుడు తరిగి వస్తున్నామో కచ్చితంగా తెలియకపోవడం కష్టతరమైన భాగం అని నేను భావిస్తున్నా." అని ఆమె అన్నారు’’ అని అన్నారు. సుదీర్ఘంగా అంతరిక్షంలో ఉండటం వల్ల భూమిపై ఉన్న ప్రజలపై ఈ ప్రభావం ఉంటుందని విలియమ్స్, విల్మోర్ అంగీకరించారు. కాగా.. వారిని భూమిపైకి తెచ్చేందుకు బైడెన్ సర్కారు ఎలాంటి ప్రయత్నం చేయలేదని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ విమర్శలు గుప్పించారు. వారిని బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న విమర్శలపై విల్మోర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘అవి రాజకీయ సంబంధమైన వ్యాఖ్యలు. అవి జీవితంలో ఒక భాగం. ఈ వ్యవహారంలో రాజకీయాలకు ఏమాత్రం జోక్యం లేదని నా అభిప్రాయం. అందరికీ డొనాల్డ్ ట్రంప్, మస్క్ పట్ల గౌరవం ఉంది. మేం మా దేశానికి, మా నాయకులకు మద్దతు ఇస్తాం. వారికి మా కృతజ్ఞతలు’’ అని మాట్లాడారు.
ఐఎస్ఎస్ ను రిటైర్ చేయాలనే అంశంపై..
మరోవైపు, 2030లో అంతరిక్ష కేంద్రం (ISS) జీవితకాలం పూర్తయిన తర్వాత నాసా, అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలు దాన్ని కక్ష్య నుంచి వేరు చేయనున్నాయి. అయితే, అప్పటికంటేముందే ఐఎస్ఎస్ను రిటైర్ చేయాలని ఇటీవల మస్క్ ప్రతిపాదించారు. కాగా.. దీనిపైన విలియమ్స్.. ‘‘ఇప్పుడు అత్యున్నత దశలో ఉన్నాం. నిష్క్రమించడానికి సరైన సమయం కాదని నేను భావిస్తున్నాను’’ అని అభిప్రాయం వ్యక్తంచేశారు. కాగా.. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్లైనర్’లో వారు ఐఎస్ఎస్ (ISS)కు చేరుకున్నారు. అయితే, ప్లాన్ ప్రకారం ఐఎస్ఎస్ లో ఉన్న ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్(Sunita Williams), బచ్ విల్మోర్లు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. సునీతా విలియమ్స్, విల్మోర్ అప్పటినుంచి ఐఎస్ఎస్లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా (NASA) స్పేస్ఎక్స్తో కలిసి పనిచేస్తోంది.
Read More : సునీతా విలియమ్స్ ఇక అంతరిక్షంలోనేనా!