ఫంక్షన్ వెళ్లొస్తున్న బస్సు-టెంపో ఢీ..11 మంది మృతి

by Mahesh |
ఫంక్షన్ వెళ్లొస్తున్న బస్సు-టెంపో ఢీ..11 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: జాతీయ రహదారిపై వివాహ వేడుకలకు వెళ్తున్న బస్సును టెంపో డీ కొట్టడంతో 11 మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఆదివారం తెల్లవారుజామున రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వివాహానికి ముందు జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రయాణికులు తిరిగి వస్తుండగా జాతీయ రహదారిపై సునీపూర్ సమీపంలో వేగంగా వచ్చిన టెంపో.. బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న 11 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు బాలురు, ముగ్గురు బాలికలు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. అలాగే మరికొంత మందికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై రాజస్థాన్ సీఎం స్పందించి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Advertisement

Next Story