Kejriwal Diet Row: కేజ్రీవాల్ ను చంపేందుకు బీజేపీ కుట్ర..!

by Shamantha N |   ( Updated:2024-07-21 09:02:37.0  )
Kejriwal Diet Row: కేజ్రీవాల్ ను చంపేందుకు బీజేపీ కుట్ర..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం(Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ ను చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Liquor Scam)కేసులో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్(Aravind Kejriwal) ఆరోగ్యంతో బీజేపీ చెలగాటమాడుతోందని మండిపడ్డారు. సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. “ కేజ్రీవాల్ ఆరోగ్యంతో బీజేపీ చెలగాటమాడుతోంది.. మొదట్లో స్వీట్లు తిని షుగర్ లెవల్స్ పెంచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తిండి తగ్గించేశారని చెబుతున్నారు. ఎవరైనా ఇలా చేసి తమ ప్రాణాలకు తామే ఎందుకు ముప్పు తెచ్చుకుంటారు?” అని అన్నారు. కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందన్న ఆయన.. జైళ్లో ఉన్నప్పట్నుంచి ఆయన 8 కిలోల బరువు తగ్గారని పేర్కొన్నారు. అకస్మాతుగా బరువు తగ్గడం తీవ్రమైన వ్యాధికి సంకేతమని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ (Kejriwal) ఆరోగ్యానికి ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేమని వైద్య పరీక్ష నివేదికలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రకటనలు తమ సందేహాన్ని ధ్రువీకరిస్తోందన్నారు.

వీకే సక్సేనా లేఖలో ఏముందంటే?

కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై శుక్రవారం ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి సమాచారం అందింది. జైల్లో కేజ్రీవాల్‌ వైద్యులు సూచించిన ఆహారం తీసుకోవడం లేదని అందులో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కారణమేంటో కనుక్కోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆరోగ్య పరిస్థితిపై తమకు జైలు నుంచి సమాచారం అందిందని పేర్కొన్నారు. కావాలనే తక్కువ కెలోరీలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారని నివేదికలో ఉన్నట్లు సీఎస్‌కు రాసిన లేఖలో తెలిపారు. జులై 7న రాత్రి భోజనానికి ముందు ఇన్సులిన్‌ తీసుకోవడానికి కూడా కేజ్రీవాల్‌ నిరాకరించినట్లు తెలిపారు. ఇంటి నుంచి ఆహారం వస్తున్నప్పటికీ.. ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారని ఆరా తీశారు. కాగా.. ఎల్జీ నుంచి వచ్చిన సమాచారాన్ని సంజయ్ సింగ్ ఖండించారు.

Advertisement

Next Story

Most Viewed