- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
లోక్ సభలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, విప్ గా ఎవరంటే?
దిశ, నేషనల్ బ్యూరో: లోక్సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, విప్ లను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎంపీ గౌరవ్ గొగొయ్ను తిరిగి నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. గతంలోనూ గౌరవ్ గొగొయ్ లోక్సభాపక్ష ఉపనేతగా బాధ్యతలు నిర్వహించారు. లోక్సభలో పార్టీ చీఫ్విప్గా సీనియర్ నేత కొడినున్నిల్ సురేశ్ ని నియమించినట్లు కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 8సార్లు ఎంపీగా గెలిచిన సురేశ్ ను కాంగ్రెస్ చీఫ్ విప్ గా నియమించినట్లు తెలిపారు.
లోక్ సభ స్పీకర్ కు సోనియాగాంధీ లేఖ
లోక్ సభలో విప్ గా కాంగ్రెస్ సీనియర్ నేతలు మాణిక్కం ఠాగూర్, ఎండీ జావేద్లు బాధ్యతలు అప్పగించినట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ నియామకాలకు సంబంధించిన కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాసినట్లు వివరించారు. లోక్సభలో కాంగ్రెస్ కొత్తగా నియమించిన ఉపనేత, చీఫ్విప్, విప్ల పేర్లను స్పీకర్ కు సమర్పించిన లేఖలో వెల్లడించారని తెలిపారు. ప్రతిపక్షనేత రాహుల్గాంధీ ఆధ్వర్యంలో లోక్సభలో ప్రజావాణిని బలంగా వినిపిస్తామని కేసీవేణుగోపాల్ పేర్కొన్నారు.