సింధు నదిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

by Disha Web Desk 12 |
సింధు నదిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: సోనామార్గ్ నుండి కంగన్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న తొమ్మిది మందిలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో జమ్మూ, కాశ్మీర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 9 మంది ప్రయాణికులతో వెళ్తున్న కారు అదుపుతప్పి గగంగీర్ వద్ద రోడ్డుపై నుంచి సింధు నదిలో పడింది. ఈ సమాచారం అందుకున్న పిఎస్ గుండ్ SDRF మరియు ఇతర దళాలతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. కారులో చిక్కుకుని ఉన్న ఇద్దరిని ప్రాణాలతో కాపాడగా.. నాలుగు 4 మృతదేహాలను కూడా సంఘటన స్థలం నుంచి వెలికి తీశారు. అలాగే తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed