'రూ.500 కోట్ల బ్లాక్ మనీ.. 50 కేజీల బంగారం ప్రైవేట్‌ లాకర్లలో దాటిపెట్టారు'.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

by Vinod kumar |
రూ.500 కోట్ల బ్లాక్ మనీ.. 50 కేజీల బంగారం ప్రైవేట్‌ లాకర్లలో దాటిపెట్టారు.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
X

జైపూర్: రాజస్థాన్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ కిరోడీ మీనా సంచలన ఆరోపణలు చేశారు. జైపూర్‌లోని 100 ప్రైవేట్ లాకర్లలో కొందరు వ్యక్తులు రూ.500కోట్ల నల్లధనాన్ని, 50కిలోల బంగారన్ని దాచిపెట్టారని ఆరోపించారు. పోలీసులు వచ్చి ఆ లాకర్లను ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఆ లాకర్లు ఎవరివి అన్నది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. ఈ మేరకు పింక్ సిటీలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆ లాకర్లు ఎవరివో ఇప్పుడే చెబితే, రాజకీయ ఒత్తిళ్లతో వాటిని తెరిచే అవకాశం ఉండదని అన్నారు. అనంతరం ఆ లాకర్లు గల బిల్డింగ్‌ వద్దకు వెళ్లిన ఆయన.. పోలీసులు వచ్చి తక్షణమే వాటిని తెరవాలని డిమాండ్ చేశారు. కాగా, రాజ్యసభ ఎంపీగా ఉన్న మీనా.. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సవాయి మాధోపుర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.

Advertisement

Next Story