Ajmer: రాజస్థాన్‌లోని ఆజ్మీర్‌లో ఉద్రిక్తత.. ఇరు వర్గాల ఘర్షణలో యువకుడు మృతి

by vinod kumar |
Ajmer: రాజస్థాన్‌లోని ఆజ్మీర్‌లో ఉద్రిక్తత.. ఇరు వర్గాల ఘర్షణలో యువకుడు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లోని ఆజ్మీర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ భవన నిర్మాణంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగగా యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైన సమాజ్ గ్రూపునకు చెందిన రూపన్‌గఢ్ ప్రాంతంలో ఇటీవల నిర్మించిన ఓ భవనం విషయమై రెండు వర్గాల మధ్య ఆదివారం గొడవ జరిగింది. వాగ్వాదం ఎక్కువ కావడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలు, రాడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దుండగులు కాల్పులు జరపగా ఓ వ్యక్తి మరణించడంతో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో గుంపు జేసీబీతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేసి తగులబెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొనడంతో భద్రతా బలగాలను మోహరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హింసకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. మరణించిన వ్యక్తిని షకీల్ లంగా (25)గా గుర్తించారు.

Next Story

Most Viewed