డబ్బున్న వాడికి పేదవాడి కష్టాలు ఏం తెలుస్తాయి : అజిత్ పవార్

by M.Rajitha |
డబ్బున్న వాడికి పేదవాడి కష్టాలు ఏం తెలుస్తాయి : అజిత్ పవార్
X

దిశ, వెబ్ డెస్క్ : 'లడ్కీ బహిన్ యోజన' పథకం కింద అర్హుల ఖాతాల్లో రూ.3000 వేల కోట్లు జమ చేశామని అన్నారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్. పేదల కోసం ఈ పథకాన్ని ప్రకటిస్తే కొంతమంది ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండి పడ్డారు. పేదల కష్టాలు ఏంటో పుట్టుకతోనే డబ్బున్నవారికి ఎలా తెలుస్తాయని అజిత్ ఎద్దేవా చేశారు. ప్రజలు విపక్షాల విమర్శలు పట్టించుకోవాల్సిన పని లేదని, తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అని అన్నారు. తమ ప్రభుత్వం పేదవారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పథకాలకు రూపకల్పన చేస్తుందని తెలియ జేశారు. అవసరమైతే ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకొని మరీ పథకాలపై వెచ్చిస్తామని అజిత్ ప్రకటించారు. తమకు గత ప్రభుత్వం లాగా హంగు ఆర్భాటాలు లేవని, అందువల్ల రాష్ట్ర ఆదాయం పథకాల వినియోగానికి సరిపోతుందని అన్నారు. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నానని తెలిపారు.

Next Story

Most Viewed