Aap councillor : కేజ్రీవాల్ కలలోకి వచ్చి మాట్లాడారు.. తిరిగి ఆప్‌లో చేరిన కౌన్సిలర్ కీలక వ్యాఖ్యలు

by vinod kumar |
Aap councillor : కేజ్రీవాల్ కలలోకి వచ్చి మాట్లాడారు.. తిరిగి ఆప్‌లో చేరిన కౌన్సిలర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చెందిన ఐదుగురు కౌన్సిలర్లు ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే అందులో ఒక కౌన్సిలర్ రామ్ చందర్ మూడు రోజుల్లోనే యూటర్న్ తీసుకున్నారు. గురువారం తిరిగి ఆప్‌లో చేరారు. మనీష్ సిసోడియా, ఇతర పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఆప్‌లో జాయిన్ అయ్యారు. అనంతరం రామ్ చందర్ మాట్లాడుతూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన చిన్న సైనికుడిని. గతంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నా. కానీ ప్రస్తుతం మళ్లీ మా కుటుంబంలోకి తిరిగి వచ్చా. నిన్న రాత్రి మా పార్టీ చీఫ్, సీఎం కేజ్రీవాల్ నా కలలోకి వచ్చి నాతో మాట్లాడారు. రామ్ చందర్ నిద్రలోంచి లేచి సిసోడియా, గోపాల్ రాయ్, సందీప్ పాఠక్, ఇతర నాయకులందరినీ కలవండి. ఆ ప్రాంతంలోని మీ కార్యకర్తలను కలుసుకుని పని చేయండి అని చెప్పారు. అందుకే తిరిగి ఆప్‌లోకి వచ్చా’ అని వ్యాఖ్యానించారు. ఇక ఎప్పటికీ ఆప్‌ను వీడబోనని ప్రమాణం చేశారు. బీజేపీలో చేరి పెద్ద తప్పు చేశానన్నారు. మళ్లీ ఆప్ లోకి ఆహ్వానించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story